నోబెల్ బహుమతి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు మరియు శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ప్రారంభించబడ్డాయి(నోబెల్ మరణించిన 5 సంవత్సరముల తరువాత). ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్దం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇవ్వడము జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్ గారి వర్దంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్ హోం లో ఇవ్వబడతాయి. వివిధ రంగములలో విశేషమైన కృషి/పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు/పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.
[మార్చు] నోబెల్ పురస్కారం ప్రదానం చేసే రంగాలు
నోబెల్ పురస్కారం 6 ప్రముఖ రంగాలలో ఇవ్వబడుతుంది. అవి,
- భౌతిక శాస్త్రం
- రసాయన శాస్త్రము
- సాహిత్యము
- వైద్యశాస్త్రము
- ఆర్థిక శాస్త్రం
- శాంతి రంగం
[మార్చు] ఇవీ చూడండి
నోబెల్ బహుమతి పొందిన భారతీయులు