సిరివెన్నెల సీతారామశాస్త్రి
వికీపీడియా నుండి
సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశము చేసిన చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలములో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి' ని పేర్కొనే సీతారామశాస్త్రి గురువుగా 'వై.సత్యారావు' ని చెబుతారు.[1]
సీతారామశాస్త్రి | |
జన్మ నామం | చెంబోలు సీతారామశాస్త్రి |
---|---|
జననం | మే 20,1955 అనకాపల్లి, విశాఖపట్నంజిల్లా,ఆంధ్రప్రదేశ్ |
స్వస్థలం | అనకాపల్లి |
నివాసం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్ |
ఇతర పేర్లు | 'సిరివెన్నెల సీతారామశాస్త్రి' |
వృత్తి | కవి, రచయిత, గాయకుడు, మరియు నటుడు |
మతం | బ్రాహ్మణ హిందూ |
భార్య/భర్త | పద్మావతి |
తండ్రి | డా.సి.వి.యోగి |
తల్లి | సుబ్బలక్ష్మి |
విషయ సూచిక |
[మార్చు] బాల్యం
శాస్త్రి గారి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు[1] పాటలు రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమా పేరుతోనే 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది.
[మార్చు] కవిగా
300 పాటలతో 'శివకావ్యం' రచనలో నిమగ్నమయి వున్నారు.
[మార్చు] సినిమా పాటల రచయితగా
'విధాత తలఁపున ప్రభవించినది...' అంటూ ఆయన రాసిన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టంది.
ధన మాయ ను ఎంత చిన్న చిన్న పదాలలొ పొదగగలరో దైవ మాయ ని కూడ అంతే సులువుగా విడమరచి చెప్పగల ప్రజ్ఞాశలి సిరివెన్నెల. సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఎప్పుడో ఎర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగు లో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల. ఫ్రస్తుత కాలమాన పరిస్ఠితులలో ప్రముఖం గా సినిమా పాటలతో ప్రజలను అలరిస్తున్న 'సిరివెన్నెల పాటల వల్ల మాత్రమే తెలుగు పాటల్లో లో తెలుగు ఇంకా బ్రతికి ఉంది అంటే అతిశయోక్తి కాదు అంటే ఒప్పుకోని జనాభా తక్కువేమో.
ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటలలో మచ్చుకు కొన్ని గుర్తు చేసుకుంటే:
- . ఆరంగేట్రం 'సిరివెన్నెల' లోని ప్రతి పాట అణిముత్యమే.
- . స్వయంకృషిలోని పాటలు
- . రుద్రవీణలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ ; జాతీయ అవార్డు అందుకున్న 'లలిత ప్రియ కమలం విరిసినదీ
- . స్వర్ణకమలంలోని అన్ని పాటలు - ముఖ్యంగా : 'ఆకాశం లో ఆశల హరివిల్లూ ; 'అందెల రవమిదీ
- . శృతిలయలు లో - తెలవారదేమో స్వామి
- . శివ లో 'బోటని పాఠముందీ
- . క్షణక్షణం లో 'కో అంటె కోటి ; 'జాము రాతిరి జాబిలమ్మా
- . గాయం లో 'అలుపన్నది ఉందా' ; 'నిగ్గ దీసి అడుగూ ; రాష్ట్ర నంది అవర్డు సాధించిన 'స్వరాజ్యమవలేని
- . గులాబి లో 'ఏ రోజైతె చూశానో నిన్నూ ; 'క్లాసు రూము లో తపస్సు చేయుట వేస్టురా గురూ'
- . మనీలో 'చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ ; 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ'
- . శుభలగ్నం లోని 'చిలకా ఏ తోడు లేకా
- . నిన్నే పెళ్ళడతా లోని 'కన్నుల్లో నీ రూపమే ; 'నిన్నే పెళ్ళాడెస్తానంటూ'
- . సింధూరం లోని అన్ని పాటలు ; ముఖ్యంగా - 'సంకురాత్రి పండగొచ్చెరో' ; 'అర్థ శతాబ్దపూ
- . దేవీపుత్రుడు లోని 'ఓ ప్రేమా'
- . చంద్రలేఖ లోని 'ఒక్క సారి ఒక్క సారి నవ్వి చూదయ్యో
- . నువ్వే కావాలి నుంచి 'ఎక్కడ ఉన్నా' ; 'కళ్ళలొకి కళ్ళు పెట్టీ
- . నువ్వు నాకు నచ్చావు నుంచి 'ఆకశం దిగివచ్చీ ;
- . శుభ సంకల్పం నుంచి 'హైలెస్సో 'సీతమ్మ అందాలూ
ఇలా చెప్పుకొంటూ పోతే చాలా కనిపిస్తాయి.
[మార్చు] నటుడిగా
ప్రముఖ తెలుగు,హిందీ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో స్వరాజ్యమవలేని... సమాజాన్ని నిగ్గదీసి అడుగు... అని పాట పాడుతున్న ప్రభావశీలమయిన పాత్రలో తను వ్రాసి నటించగా,[1] తను వ్రాసిన పాటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది[1] పురస్కారం లభించటం విశేషం.
[మార్చు] పురస్కారాలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, ఉత్తమ గేయ రచయితగా :
- 1986 - సిరివెన్నెల - విధాత తలఁపున...
- 1987 - శృతిలయలు - తెలవారదేమో ...
- 1988 - స్వర్ణకమలం - అందెల రవమిది...
- 1993 - గాయం - స్వరాజ్యమవలేని...
- 1994 - శుభలగ్నం - చిలకా ఏ తోడులేక...
- 1995 - శ్రీకారం - మనసు కాస్త కలత...
- 1997 - సింధూరం - అర్ధ శతాబ్దపు...
కళాసాగర్ అవార్డులు 4 పర్యాయములు ఉత్తమ గేయ రచయితగా...
సౌతిండియా టెక్నీషియన్స్ అసోసియేషన్ వారి 1988వ సంవత్సరపు ఉత్తమ గేయ రచయిత పురస్కారం -రుద్రవీణ సినిమాకు.
మనస్విని సంస్థ ద్వారా ఆత్రేయ బంగారు కిరీటం.
ఇంకా వివిధ సాంస్కృతిక సంస్థల నుండి 40 కి పైగా పురస్కారాలు[1] అందుకున్న లబ్దప్రతిష్టుడు.
[మార్చు] బయటి లింకులు
మనసిరివెన్నెల
సీతారామశాస్త్రి గారితో పరిచయం