ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - ఆధునిక యుగము
వికీపీడియా నుండి
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర |
|||||
---|---|---|---|---|---|
----------- కాలరేఖ ----------- | |||||
చరిత్ర పూర్వ యుగము | క్రీ.పూ. 1500 వరకు | ||||
పూర్వ యుగము | క్రీ.పూ. 1500 - క్రీ.త. 650 వరకు | ||||
• మౌర్యులకు ముందు | • క్రీ.పూ.1500 - క్రీ.పూ. 322 | ||||
• మౌర్యులు | • క్రీ.పూ.322 - క్రీ.పూ. 184 | ||||
• శాతవాహనులు | • క్రీ.పూ.200 - క్రీ.త.200 | ||||
• కళింగులు | • క్రీ.పూ.180? - క్రీ.త.400? | ||||
• ఇక్ష్వాకులు | • 210 - 300 | ||||
• బృహత్పలాయనులు | • 300 - 350 | ||||
• అనందగోత్రులు | • 295 - 620 | ||||
• శాలంకాయనులు | • 320 - 420 | ||||
• విష్ణుకుండినులు | • 375 - 555 | ||||
• పల్లవులు | • 400 - 550 | ||||
పూర్వమధ్య యుగము | 650 - 1320 | ||||
• మహాపల్లవులు | |||||
• రేనాటి చోడులు | |||||
• చాళుక్యులు | |||||
• రాష్ట్రకూటులు | |||||
• తూర్పు చాళుక్యులు | • 624 - 1076 | ||||
• పూర్వగాంగులు | • 498 - 894 | ||||
• చాళుక్య చోళులు | • 980 - 1076 | ||||
• కాకతీయులు | |||||
• అర్వాచీన గాంగులు | |||||
ఉత్తరమధ్య యుగము | 1320 - 1565 | ||||
• ముసునూరి నాయకులు | • 1320 - 1360 | ||||
• ఓఢ్ర గజపతులు | • | ||||
• రేచెర్ల వెలమలు | • | ||||
• కొండవీటి రెడ్డి రాజులు | • | ||||
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు | • | ||||
• బహమనీ రాజ్యము | • | ||||
• విజయనగర సామ్రాజ్యము | • 1336 - 1565 | ||||
ఆధునిక యుగము | 1540 – 1956 | ||||
• అరవీటి వంశము | • 1572 - 1680 | ||||
• గోలకొండ రాజ్యము | • | ||||
• నిజాము రాజ్యము | • | ||||
• బ్రిటిషు రాజ్యము | • | ||||
• స్వాతంత్ర్యోద్యమము | • 1800 - 1947 | ||||
• ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు | • | ||||
• హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు | • | ||||
• ఆంధ్ర ప్రదేశ్ అవతరణ | • | ||||
ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర | • | ||||
తెలుగు సాహిత్యం నన్నయకు ముందు నన్నయ యుగము • శివకవి యుగము తిక్కన యుగము • ఎఱ్ఱాప్రగడ యుగము శ్రీనాధుని యుగము • రాయల యుగము దాక్షిణాత్య యుగము • క్షీణ యుగము ఆధునిక యుగము • 21వ శతాబ్ధి |
|||||
చారిత్రిక నగరాలు భట్టిప్రోలు • వేంగి • ధాన్యకటకము కొలనుపాక • ఓరుగల్లు • విజయపురి హంపి • సింహపురి • హైదరాబాదు |
|||||
చారిత్రిక వ్యక్తులు గణపతిదేవుడు • రుద్రమదేవి • కృష్ణదేవరాయలు శాలివాహనుడు • |
|||||
|
(పరిచయం ఇక్కడ వ్రాయాలి)
విషయ సూచిక |
[మార్చు] యుగ విభజన
[మార్చు] యుగ చరిత్ర ముఖ్యాంశాలు
[మార్చు] అరవీటి వంశము
[మార్చు] గోలకొండ రాజ్యము
[మార్చు] నిజాము రాజ్యము
- ప్రధాన వ్యాసం: నిజాము
[మార్చు] బ్రిటిషు రాజ్యము
[మార్చు] స్వాతంత్ర్యోద్యమము
[మార్చు] ఆంధ్రోద్యమములు
- ప్రధాన వ్యాసం: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
- ప్రధాన వ్యాసం: హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
[మార్చు] విశాలాంధ్ర
- ప్రధాన వ్యాసం: పెద్దమనుషుల ఒప్పందం
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్
- ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ అవతరణ
ఆధునిక ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో మూడు ముఖ్యమైన చారిత్రక ఘట్టాలున్నాయి. అవి:
మధ్య యుగంలో కాకతీయులు, విజయనగర రాజులు, చోళులు, చాళుక్యులు, రెడ్డి రాజులు మొదలైన అనేక వంశాల పాలనలో ఉంటూ వచ్చిన ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ 19 వ శతాబ్దం ఆరంభం నాటికి కొంత భాగం బ్రిటిషు వారి పాలనలోను, కొంత నిజాము నవాబు ఏలుబడిలోను ఉంది. సర్కారులు గాను, రాయలసీమ గాను, హైదరాబాదు(నైజాం) గాను విడిపోయి ఉన్న ఈ ప్రాంతాలను కలిపే మూలసూత్రం - వీరి మాతృభాష అయిన తెలుగు. ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న ఆకాంక్ష అన్ని ప్రాంతాల ప్రజలలోను బలంగా ఉండేది.
బ్రిటిషు వారి పాలనలో ఉన్న సర్కారు (కోస్తా) జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ముందు ఉద్యమించాయి. ఈ ప్రాంతాలు, తమిళ ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా ఉండేవి. ఆర్ధిక, రాజకీయ రంగాల్లో తమిళుల అహేతుక ఆధిపత్యం భరించలేకా, తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలన్న బలీయమైన కోరిక వలనా వీరు ప్రత్యేక రాష్ట్ర దిశగా ముందు ఉద్యమించారు.
హైదరాబాదు సంస్థానం కథ వేరుగా ఉండేది. నిజాము ఏలుబడిలో ఉన్న ప్రజలు, స్వాతంత్ర్యం తరువాత ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము ఆలోచనకు వ్యతిరేకంగాను, నిజాము యొక్క రజాకార్ల దౌష్ట్యాన్ని ఎదిరించేందుకు గాను నడుం కట్టారు. నిజాము పాలన నుండి బయటపడి భారత దేశంలో విలీనం కావాలన్నదే అప్పటి వీరి ప్రధాన లక్ష్యం.
[మార్చు] ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
- ప్రధాన వ్యాసము: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
బ్రిటిషు పరిపాలనా కాలంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా, బ్రిటిషు వారి అధికారంలో ఉండేవి. మద్రాసు ప్రెసిడెన్సీలో కింది జిల్లాలు ఉండేవి.
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు.
మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. జనాభా లోను, విస్తీర్ణం లోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్పటికీ, పరిపాలన లోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు.
1912 లో ఆధికారికంగా ప్రత్యేక రాష్ట్ర పోరాటం మొదలయింది. ఉద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి వంటి నాయకులు సారథ్యం వహించారు. 40 సంవత్సరాల పోరాటం, రెండు సుదీర్ఘ నిరాహార దీక్షలు, అమరజీవి ఆత్మార్పణం, విధ్వంసానికి దారితీసిన ప్రజల కోపం తరువాత 1952 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
[మార్చు] హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
- ప్రధాన వ్యాసము: హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు నిజాము పాలన నుండి విముక్తి కాలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్న నిజాము, తన ఆలోచనకు తగినట్లుగా ప్రయత్నాలు చేసాడు. ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలికి సమస్యను నివేదించడం, సైన్యం, ఆయుధాల సమీకరణ వంటి ప్రయత్నాలు వీటిలో కొన్ని. దీనికి తోడు రజాకార్ల హింస పెచ్చుమీరడంతో, హైదరాబాదు ప్రజలు కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం జరిపారు.
పరిస్థితి విషమిస్తున్న దశలో భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13 న పోలీసు చర్యకు దిగింది. భారత సైన్యం హైదరాబాదు ను ముట్టడించి, నిజామును ఓడించింది. 5 రోజుల్లో ముగిసిన పోలీసు చర్యతో సెప్టెంబరు 18 న హైదరాబాదు సంస్థానం భారత దేశంలో విలీనమయింది.
మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు. 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజామును రాజ్ ప్రముఖ్ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చింది.
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్ అవతరణ
1953 డిసెంబరు లో సయ్యద్ ఫజల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్విభజన కమిషను ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్థించింది. దీని నివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టు లు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, హైదరాబాదు శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.
కాంగ్రెసు అధిష్ఠానం కూడా విశాలాంధ్రనే సమర్థించి, ఆంధ్ర, తెలంగాణా నాయకులను తమ విభేదాలను పరిష్కరించుకొమ్మని ఒత్తిడి చేసింది. ఆ విధంగా వారిమధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరి, 1956 నవంబరు 1 న ఆధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
[మార్చు] ఇవి కూడా చూడండి
- ప్రధాన వేదిక: ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
- ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ
[మార్చు] మూలాలు
[మార్చు] వనరులు
- ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- ఏటుకూరి బలరామమూర్తి - ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్