వంగర (భీమదేవరపల్లి)
వికీపీడియా నుండి
వంగర, కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము చిన్నదైనప్పటికీ భారత దేశపు రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. పదివేల జనాభా కూడా లేని ఈ గ్రామము విశాల భారతదేశానికి ఒక ప్రధానమంత్రిని అందించడమే దీని విశిష్టత. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి పాముల పర్తి వెంకట నరసింహారావు 1921, జూన్ 28న ఈ గ్రామములో ఒక రైతు కుటుంబంలో జన్మించినాడు.
[మార్చు] చేరు విధానం
హైదరాబాదు నుంచి 6 గంటల రైలు ప్రయాణం అనంతరం కరీంనగర్ చేరుకున్న తరువాత అక్కడి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజురాబాదుకు బస్సు ద్వారా చేరవచ్చు. అక్కడి నుంచి మరో 25 కిలోమీటర్ల దూరం బస్సులో కాని ఆటోల ద్వారా కాని ప్రయాణించి వంగర గమ్యస్థానం చేరవచ్చు.
[మార్చు] ఈ గ్రామపు ప్రముఖులు
- భారత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు
|
|
---|---|
వంగర (పెద్ద) · భీమదేవరపల్లి · రత్నగిరి · మాణిక్యాపూర్ · కొప్పూర్ · కొత్తపల్లి · ముల్కనూర్ · ముత్తారం (పీ.క్) · ముస్తఫాపూర్ (భీమదేవరపల్లి మండలం) · గట్లనర్సింగాపూర్ · కొత్తకొండ · మల్లారం · కట్కూర్ · కన్నారం · ఎర్రబల్లి (భీమదేవరపల్లి) |