మార్కండేయుడు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం. బాలుని గానే యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.
విషయ సూచిక |
[మార్చు] మృకండు మహర్షి తపస్సు
మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులొ లీనమై నిశ్చలుడై ఉన్న సమయం లొ ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని తీర్చుకొనేవి. మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకండు మహర్షి అని పిలిచేవారు. మరుద్వతి అనే మహాసాద్వి ఆయన భార్య. వారి ఉన్న ఏకైక లొటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశి కి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు. వారణాశి లొ వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి, శివుడు గురించి ఘోర తపస్సు చేస్తారు. మహాదేవుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై మృకండ మహర్షి ని మరోమారు పరీక్ష చేయడానికి, సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా మృకండు మహర్షి సద్గుణుదైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహదేవుడు సంతసించి పుత్రుడ్ని ఇచ్చాను అని పల్కి అదృశ్యమౌతాడు.
[మార్చు] సప్తర్షులు ఆశీర్వచనం
మహాదేవుని మాట ప్రకారం మరుద్వతి గర్భవతి అయి 9 నెలలునిండాక దివ్యతేజస్సు కలిగిన పుత్రుడ్ని ప్రసవించింది. మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల వానికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు. 7 సంవత్సరాలు 3 నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్తఋషుల మృకండ మహర్షి చూడడానికి వస్తారు. మార్కండేయుడు సప్తఋషులు నమస్కరించిన వెంటనే సప్తఋషులు చిరంజీవా అని దీవిస్తారు. మృకండు మహర్షి ఇది విని తనకొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని అడుగగా సప్తఋషులు దివ్యదృష్టితో శివునికి మృకండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. వీరు మార్కండేయుడుని బ్రహ్మ దగ్గరకు తీసుకొనిపొయి బ్రహ్మ చేత కుడా చిరంజీవి అని దీవింపచేస్తారు. ఆతరువాత దివ్యదృష్టి తొ మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంగతి తెలుసుకొని మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెప్పి బ్రహ్మ కుడా శివుని గురించి తపస్సు చేసి మార్కండేయుడుడిని చిరంజీవి చెయ్యమని అడుగుతాడు.
[మార్చు] నారదుడు యముడిని మార్కండేయుడుని కలవడం
మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడు కి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయ్యకపొతే ప్రపంచానికి యమడి భయం పొతుందీని చెప్పి మార్కండేయుని దగ్గరకు వెళ్తాడు. నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చెయ్యమని చెప్తాడు.
[మార్చు] మార్కండేయుడు చిరంజీవి అవడం
16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తనకింకర్లు ని మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు. వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితొ శివారాధన చేస్తున్నాడు. యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని శివామహాదేవా కాపాడు అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపొయి మహాదేవా క్షమించు కరుణించమంటాడు. శివుడు యముడ్ని క్షమించి మార్కండేయునితో నాయనా చిరంజీవి! నువ్వు పుట్టినప్పటించి చిరాయుర్ధాయం కలవడివి. నీ తండ్రి పుత్రుడిన్ని కొరుకొన్నమన్నప్పుడు పుత్రుడ్ని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు. ఇప్పటికి కుడా చిరంజీవిగా ఉన్నడు.
[మార్చు] మహాభారతం లొ మార్కండేయడు
- అరణ్యపర్వము లొ ధర్మరాజు కు నీతి విషయాలు చెబుతాడు
[మార్చు] మార్కండేయునిపై సినిమాలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో Markandeya పేజీ (1922)
- మార్కండేయ ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో Markandeya పేజీ (1938)
- భక్త మార్కండేయ ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో Bhakta Markandeya పేజీ (1956)
[మార్చు] మరికొన్ని విషయాలు
- యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము: చంద్రశేఖరాష్టకం పూర్తి పాఠం వికీమూలాల్లో.
- మార్కండేయ పురాణం
- మహా మృత్యుంజయ స్తోత్రం