చర్చ:విజయనగర సామ్రాజ్యము
వికీపీడియా నుండి
రామరాయలు పెనుకొండకు పారిపోయాడు.-> ఇది తప్పు. తళ్ళికోట యుద్దంలో రామరాయలు, వెంకటరాయలు మరణించగా తిరుమలరాయలు పెనుకొండకు పారిపోయాడు. దీన్ని మోడరేటర్లు ద్రువీకరించి..సరిదిద్దవలసింది --నవీన్ 14:52, 3 జనవరి 2007 (UTC)
- బాగా పట్టారు. ఈ తప్పును సరిచేశా --వైఙాసత్య 20:21, 3 జనవరి 2007 (UTC)
- వ్యాసాన్ని పూర్తిగా తిరగరాస్తున్నాను. ఆంగ్ల వికీ లోని en:Origin of Vijayanagara Empire వ్యాసములో నేను చేసిన పలు మార్పులు చూడండి. చాల శ్రమించి, కొందరు కన్నడిగులతో పలువాదనలు చేసి, పర్యవసానముగా సామ్రాజ్యపు తెలుగు మూలాలగురించి వివరముగా వ్రాసి రక్షించుకొంటూ వస్తున్నాను. విజయనగర రాజ్యము ముమ్మాటికీ తెలుగువారిచే స్థాపించబడిన తెలుగు రాజ్యము. తెలుగు వారికి, తెలుగు భాషకు తెలుగునేల మీద కాలము కలిసిరాక కర్ణాటదేశమునకు వలసబోయి దక్షిణభారతమును, హిందూమతమును నాలుగు శతాబ్దాలు ప్రాణాలొడ్డికాపాడిన మహనీయుల ఉత్కృష్టచరిత్ర ను అందరికీ తెలియచేయుట మనందరి కర్తవ్యం.Kumarrao 17:29, 28 ఏప్రిల్ 2008 (UTC)