సౌందర్య
వికీపీడియా నుండి
సౌందర్య (జులై 17, 1971 - ఏప్రిల్ 17, 2004) ప్రముఖ సినీనటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం మరియు మళయాలం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఈమె 100 కు పైగా చిత్రాలలో నటించింది.
ఆమె అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించుచున్నప్పుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది.
తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు గడించి, ఇక్కడ ఆమె విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మళయాళం మరియు ఒక హిందీ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె అమితాబచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది.
సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రం నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక పభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.
సౌందర్య ఏప్రిల్ 17, 2004 న విమాన ప్రమాదంలో మరణించింది. ఎన్నికల సందర్భంగా, భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రశంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె అన్న, కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించారు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం "ఆప్త మిత్ర" విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్ధం "సౌందర్య స్మారక పురస్కారం" ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరించుచున్నారు.
విషయ సూచిక |
[మార్చు] సినీ జీవితము
తెలుగు సినీపరిశ్రమలో అత్యంత ప్రభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ సరసన రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర బంధం వంటి హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంట గా గుర్తంపబడ్డారు. అందాల ప్రదర్శన కి బద్ధ వ్యతిరేకి. తెలుగు ప్రజలు ఆమెనెప్పటికీ మరువలేరు. పన్నెండేళ్ళ అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలనందుకొన్నారు. అవి: అమ్మోరు [1994], అంత:పురం[1998], రాజా [1999], ద్వీప [2002] {ఉత్తమ నటి మరియు ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు}, ఆప్తమిత్ర [2004]. కర్ణాటక ప్రభుత్వం నుంచి 4 ప్రతిష్టాత్మక పురస్కారాలు దొనిసగలి[తెలుగులో మహిళ], ద్వీప[ఉత్తమ నటి మరియు ఉత్తమ నిర్మాత విభాగాల్లో 2 పురస్కారాలు], ఆప్తమిత్ర చిత్రాలకై అందుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు ప్రతిష్టాత్మక నంది పురస్కారాలను అమ్మోరు, పవిత్రబంధం, అంత:పురం చిత్రాలకై అందుకున్నారు. పరిశ్రమ లో లైట బాయ్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ ఆదుకునే మనిషి గా ఆవిడ కు పేరు ఉంది. వీటన్నింటి మూలంగా పరిశ్రమలోనే కాక అభిమానుల హృదయాలలోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు "సౌందర్య"
[మార్చు] వ్యక్తిగత జీవితము
సౌందర్య అష్టగ్రామంలో జన్మించింది, మరియు ఆమె అష్టగ్రామ అయ్యర్. ఆమె ఆర్.ఎస్.ఎస్. తో ప్రభావితమై భా.జ.పా. లో చేరారు. ఈమె తన మేనమామ మరియు తన బాల్యస్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘు ను 27 ఏప్రిల్ 2003 లో వివాహమాడారు. ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలనే కలలుండేవి. ఈమె తాను మరణించేనాటికి 'కామ్లి' అనే చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు, దీనికి దర్శకుడిగా కె.ఎన్.టి.శాస్త్రి వహించేవారు. ఈమె 'అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' (ASSET) ద్వారా తన భర్త మరియు ఆడపడుచు సహకారంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. కర్నాటక, ములబాగల్ తాలూకా లోని తన గ్రామం గంగికుంట ను అభివృద్ధి పరచారు. ఓ అనాధాశ్రయాన్ని, ఓ పాఠశాల 'అమర సౌందర్య విద్యాలయ' పేరుతో స్థాపించారు. తన తమ్ముడు అమరనాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అంతేగాక తన భర్త మరియు ఆడపడుచు ల కలలను సాకారం చేస్తూ విద్యాలయాలను స్థాపించారు, మరియు సహాయ సహకారాలను అందించారు. వీరి కుటుంబం ఇప్పటికీ ఈ విద్యాలయాలకు ధనసహాయం చేస్తూనే వున్నది.
[మార్చు] నటించిన చిత్రాలు
[మార్చు] తెలుగు
|
|
|
[మార్చు] కన్నడం
- ద్వీప (2001)
- ఆప్తమిత్ర (2004)
[మార్చు] తమిళం
- తవసి
- హరిశ్చంద్ర
- అరుణాచలం (1997)
- కాదలా కాదలా (1998)
- పడయప్ప (1999)
[మార్చు] మళయాళం
- యత్రకరుదే శ్రదక్కు (2002)
- కిళిచుందన్ మంపళం (2003)
[మార్చు] హిందీ
- సూర్యవంశం (1999)