ముక్తేశ్వరం(అయినవిల్లి)
వికీపీడియా నుండి
ముక్తేశ్వరం, తూర్పు గోదావరి జిల్లా, అయినవిల్లి మండలానికి చెందిన గ్రామము
విషయ సూచిక |
[మార్చు] గ్రామ చరిత్ర
తూర్పు గోదావరి జిల్లా లోని అమలాపురానికి 14 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరమున ఉన్న ఒక గ్రామం ముక్తేశ్వరం. 30-40 సంవత్సరాల క్రితం కేవలం ఒక అగ్రహారంగా ఉండేది. ఇప్పుడు వెడల్పాటి రహదారులతో, చక్కటి ఊరు ఏర్పడింది. చుట్టూ పచ్చటి ప్రకృతి, పంట కాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరితోటలు, మామిడి చెట్లు..వెరసి, మొత్తం కోనసీమ అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం. ఊరికి కొద్ది దూరంలో గోదావరి తీరం. నదికి ఆవలి పక్కన కోటిపల్లి రేవు. ఈ మధ్యనే బ్రిటీషువారి కాలంలో వేయబడ్డ కాకినాడ - కోటిపల్లి రైల్వేలైను పునరుద్ధరింపబడింది.
[మార్చు] దేవాలయాలు
- ముక్తేశ్వరాలయం, క్షణ ముక్తేశ్వరాలయం
ఈ ఊరికి ఉన్న పేరు మీదుగా కల ముక్తేశ్వరుని దేవాలయము బహు పురాతనమైనది. ఒకదానికెదురుగా ఒకటిగా రెండు శివాలయములు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. మెదటి దాని ఎదురుగ ఉండే ఆలయములో దేవుని క్షణ ముక్తేశ్వరుడు అంటారు. ముక్తేశ్వరస్వామి ఆలయములో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారము పోలి ఉంటుంది. దీనిని వనవాస సమయంలో ఇటు వైపుగా వచ్చిన శ్రీరాముడు ఇక్కడి శివలింగమును అర్చించి దాని మహత్యమును తెలుసుకొని క్షణ కాలము ఇక్కడి పరమేశ్వరుని అర్చించిన ముక్తి కలుగునని చెప్పెనని స్తహల పురాణము ద్వారా తెలియుచున్నది.
ఊరికి దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో అయినవిల్లి గ్రామంలో ప్రసిద్ది కెక్కిన మహాగణపతి ఆలయం ఉంది.
[మార్చు] గ్రామంలో సౌకర్యాలు
[మార్చు] ప్రభుత్వ కార్యాలయాలు
[మార్చు] రవాణా సౌకర్యాలు
- గోదావరి నదిపై ఆవల కల కోటిపల్లి కి వెళ్ళుటకు పంటు కలదు.
- అమలాపురం, రాజోలు, రావులపాలెం లకు బస్సులు కలవు.
- ఆటోలు, టాక్సీలు కూడా సమీప గ్రామాల మద్య తిరుగుతుండును.
|
|
---|---|
మదుపల్లి · వీరవల్లిపాలెం · చింతన లంక · వెలువలపల్లి · అయినవిల్లి · తొత్తరమూడి · కొండుకుదురు · క్రాప · శానపల్లి లంక · కే. జగన్నాథపురం · సిరిపల్లి · విలసవల్లి సవరం · నేదునూరు · పంధ్యాలచెరువు · నల్ల చెరువు · విలస · మాగాం · పొతుకుర్రు · ముక్తేశ్వరం |