బలివాడ కాంతారావు
వికీపీడియా నుండి
బలివాడ కాంతారావు ( 1927, జూలై 3 - 2000, మే 6 ) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు[1]. ఈయన రచనలపై కొద్దిమంది పరిశోధనలు కూడా చేశారు. అదే విధంగా ఈయన రచనలు ఇతర భారతీయ భాషలలోకి కూడా అనువదించబడ్డాయి. 1998లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.[2] ఇంకా చాలా అవార్డులు ఈయన్ని వరించాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, గోపీచంద్ సాహిత్య పురస్కారం, రావిశాస్త్రి స్మారక పురస్కారం, కళాసాగర్ విశిష్ట పురస్కారం ముఖ్యమైనవి. ఐదు దశాబ్దాలపాటు ఏకధాటిగా రచనలు చేసినా, ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
[మార్చు] రచనలు
- కావడి కుండలు - 1951
- దొంగలు - 1952
- శిశు విక్రయం - 1952
- పెళ్ళి -1953
- అంతరాత్మ- 1957
- ఇంటికోసం - 1967
- మంటలు - 1968
- ముంగిస కథ - 1969
- నాలుగు మంచాలు 1972 (ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ధారావాహికం)
- విలువెంత - 1975
- దగాపడిన తమ్ముడు - ?
- నిగురు తేనె - 1977
- భేదాఘాట్ మొసలి - 1977
- షోవనార (1980)
- కెంపు (1984)
- తేనె పట్టు (1989)
- సుఖ జీవనం (1989)
- ప్రతీక్ష (1990)
- దృష్టి (1991)
- చక్రతీర్థం (1992)
- గోపురం (1994)
- చైత్ర పర్వం (1998)
- తెల్ల కలువ (1998)
- దేవుళ్ళ దేశం (1998)
- Love in Goa (1998)
- అజంతా (1998)
- ఎల్లోరా (1998)