వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 25
వికీపీడియా నుండి
- ప్రపంచ శాకాహారుల దినోత్సవం
- 1839: దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుపాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా.
- 1932: ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంది.
- 1948: 'నేషనల్ క్యాడెట్ కోర్' 1948 చట్టం ప్రకారం దేశంలో ఎన్సీసీ ఏర్పాటైంది.
- 1964: ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు మరణించాడు.
- 1974: ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన యూ థాంట్ న్యూయార్క్ లో మరణించాడు.