జటప్రోలు సంస్థానము
వికీపీడియా నుండి
జటప్రోలు సంస్థానము ఈ ప్రాంతములోని ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక సంస్థానము. పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానము యొక్క స్థాపకుడే కాక, గంజాం జిల్లాలోని బొబ్బిలి రాజ వంశము, గోదావరి జిల్లాలోని పిఠాపురం, కృష్ణా జిల్లా లోని మల్లేశ్వరం మరియు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మొదలైన రాజ వంశములకు మూలపురుషుడని భావిస్తారు.
జటప్రోలు రాజా సింహాసనము అధిరోహించిన తర్వాత తన అసలు పేరు నవనీతకృష్ణ యాచేంద్రను విడిచి రాజా వెంకట లక్ష్మణరావు బహుదూర్ అనే పట్టము స్వీకరించాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వెంకట లక్ష్మణరావు 1929లో మరణించాడు.