ఉదయపూర్
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
?ఉదయపూర్ రాజస్థాన్ • భారతదేశం |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 598 మీ (1,962 అడుగులు) |
జిల్లా(లు) | ఉదయపూర్ |
జనాభా | 559,317 (2001) |
కోడులు • టెలీఫోను |
• +0294 |
వెబ్సైటు: www.udaipurmc.org |
అక్షాంశరేఖాంశాలు: ఉదయపూర్ అంటే "సిటీ ఆఫ్ సన్ రైజ్". మహారాణా ప్రతాప్ ఆత్మ నిండి ఉందా అనిపించే ఈ పట్టణాన్ని 1567లో ఆరావళి పర్వత పాదఫంక్తులలో మహారాజ ఉదయ్ సింగ్ నిర్మించారు. మేవార్ సామ్రాజ్యానికి ఇది రాజధాని. మూడు సుందరమైన సరస్సులతో, అద్భుతమైన పాలరాతి కళాసంపదతో నిండి ఉంటుంది ఉదయ్ పూర్. దక్షిణం వైపు పిచ్డా సరస్సు, మరియు మిగిలిన మూడు దిక్కులా ప్రహరీ సరిహద్దులుగా కలిగి ఉంటుంది ఈ సుందర నగరం. ఈ నగరంలో అన్నింటికన్నా చెప్పుకోదగ్గది సిటీ ప్యాలెస్. పిచోలా సరస్సు ప్రక్కనే ఉండే ఈ ప్యాలెస్ మొత్తం రాజస్థాన్ లోనే అతి పెద్దది. దీని నిర్మాణాన్ని 1559 లో మహారాణా ఉదయ్ సింగ్ II చేపట్టారు. దీన్ని ఇప్పుడు మ్యూజియం గా మార్చారు. మరో ముఖ్యమైన ప్యాలెస్ " లేక్ ప్యాలెస్". సరస్సు మధ్యలో నిర్మించబడిన ఈ అద్భుతమైన కట్టడాన్ని మహారాణా జగత్ సింగ్ వేసవి విడిదిగా నిర్మించుకున్నారు. దీని నిర్మాణం 1743 లో మొదలయి 1746 లో పూర్తయింది.సరస్సు మధ్యలో ఉండటం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఈ ప్యాలెస్ లోనే ఉదయపూర్ మహరాజు, మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ కి ఆతిధ్యమిచ్చారు. ఉదయపూర్ లో అడుగడుగునా రాజపుట్ వీరుడు, అసామాన్య ధైర్యసాహసాలతో మేవార్ గడ్డపై పరదేశీయుల ఆధిపత్యాన్ని నిరసించి తరిమికొట్టిన దేశభక్తుడు మహారాణా ప్రతాప్ ఉనికి కనిపిస్తూనే ఉంటుంది. ఈ వీరుడికి అత్యంత విశ్వాసపాత్రంగా ఉండి, ధైర్య సాహసాలతో మహారాణా ప్రతాప్ ప్రాణాలను రక్షించి చివరకు హల్దీ ఘాట్ లో జరిగిన యుద్దంలో ప్రాణాలు కోల్పోయిన గుఱ్ఱం పేరు "చేతక్". ఈ గుఱ్ఱానికి ఎంతో ఆదరంతో అనేక స్థలాలలో విగ్రహాలు కట్టించారు ఆ మహారాజులు. ముఖ్యంగా ఇది తన స్వామిని రక్షించి ప్రాణాలు కోల్పోయిన చోటయిన "హల్దీఘాట్" చెప్పుకోదగ్గది. హృదయం ద్రవించే కథ కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూడచ్చు.