సాక్షి రంగారావు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సాక్షి రంగారావు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. గుడివాడ వద్దనున్న కొండిపర్రు గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రుల పేర్లు శ్రీ లక్ష్మినారాయణ మరియు శ్రీమతి రంగనాయకమ్మ. ఈయన నటించిన మొదటి సినిమా బాపూ-రమణల సాక్షి. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు ఐయిపోయింది. దాదాపు 800 సినిమాలలో నటించారు. బాపూ, కె.విశ్వనాధ్ తమ సినిమాలల్లో ఎక్కువగా తీసుకొనే వారు. రంగారావు గారికి ఇద్దరు కుమారులు ఒక్క కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివా కూడా నటుడే. చక్కెర వ్యాధి ముదిరి కిడ్నీలు పాడయిపోవడంతో చెన్నై వైద్యశాలలో జూన్ 27, 2005 రోజున 63 యేళ్ళ వయసులో మరణించారు.