రవీంద్రనాథ్ టాగూర్ రచనలు
వికీపీడియా నుండి
రవీంద్రనాథ్ టాగూర్ రచనల లో కవితలు,నవలలు, చిన్న కథలు, నాటికలు,పెయింటింగులు, డ్రాయింగులు మరియి సంగీతము కూడా ఉన్నాయి. వాటి లో చిన్న కథలకు చాలా ప్రాముఖ్యము ఉంది. సాధారణ మానవుల జీవితాల లో జరిగే వృత్తాంతాలు ఈ చిన్న కథలలో దాగి ఉంటాయి. బంగ్లా లో ఈ ప్రక్రియను సృష్టంచిన ఘనత కూడా ఆతనికే దక్కుతుంది. ఆతని రచనలలో ఆశావదము కనపడుతుంది.
[మార్చు] నాటికలు
పదహారు సంవత్సరముల వయస్సులో మొదలు తన సోదరుడు జ్యోతిరీంద్రనాథ్ టాగూర్ రచించిన బూర్జువా నాగరికుడు (16 వ శతాబ్దపు ఫ్రెంచి రచయత మోలియే రచించిన లా బూర్జువా జెంటిల్హోమ్ ఆధారముగా ) నాటికలో ముఖ్య పాత్రతో తన నట జీవితమును మొదలు పెట్టెను. 20 సంవత్సరముల వయస్సులో వ్రాసిన వాల్మీకి ప్రతిభ ఆతని మొదట స్వీయరచిత నాటకము. ఇది టాగూర్ భవనము లో చూపబడినది. టగూర్ తన నవలలో ఏక్షన్ కాక ఫీలింగ్ ముఖ్యమని భావించెను (ఇది అప్పటి బెంగాలీ నాటకములలో కొత్త). 1890 లో రచించినవిసర్జన్("త్యాగము") ఆతని అత్యున్నత నాటకముగా చెప్పబడుతున్నది. ఆ తరువాత రచించిన నాటకములు తత్త్వ శాస్త్ర, రూపక భావములు కలిగి ఉంటాయి. 1912 లో రచించిన ఢాక్ ఘర్("పోస్టాఫీసు") కు లండన్,బెర్లిన్, పారిస్ ల నుంచి ఉన్మాద రివ్యూలు వచ్చాయి. టాగూర్ నాటకము ఛండాలిక గౌతమ బుద్దుని శిష్యుడు ఆనంద ఒక ఆదివాసి యువతిని నీళ్ళు అడిగిన వైనాన్ని వివరిస్తున్నాయి.