బ్రాహ్మణులు
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
బ్రాహ్మలు అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో అంటున్నారు. కాని బ్రాహ్మణులు అని అనాలి. బ్రాహ్మణులలో చాలా శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని (ఆంధ్ర ప్రదేశ్ కు సంబందించి)
యజనం యాజనం దనం బ్రాహ్మనస్యప్రతిగ్రహః అధ్యాపనం చాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః
- 1) ద్రావిళ్ళు - పూర్వం ద్రవిడ దేశం (తమిళనాడు) నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు).
- 2) వైదికులు - వీరు అసలైన స్థానికులు. వైదికులు అనగా వైదిక విద్యనభ్యసించి, వైదిక వ్రుత్తినే తమ కులవ్రుత్తిగా చేసుకొని జీవించే వారు. సాధారణంగా పురోహితులు, గుళ్ళల్లో పూజారులు మొదలగు వారు. మరలా పురొహితులలో రెండు రకాలవారు ఉంటారు. శుభ కార్యాలు చేయించే వారు (పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు మొదలగునవి చేయంచే వారు), తరవాత అపరం చేయించే వారు (శ్రాడ్డ కర్మలు, తద్దినాలు చేయించె వారు).
- 3) నియోగులు - నియోగులలో మరలా రెండు రకాలు - ఆరువేల నియోగులు(కరణాలు), ప్రధమ శాఖ వారు. ఇక ఆరువేల నియోగుల విషయానికి వస్తే, శ్రీ కృష్ణ దేవరయల కాలంలో వారి రాజ్య పరిపాలన సులభం కొరకు వొక రాత్రి కి రాత్రే ఆరువేలమంది ని గ్రామాధికారులుగా నియమించిడం జరిగింది. అప్పుడు అలా గ్రామాధికారులుగా నియొగించబడిన వారు ఆరువేల నియోగులుగాను, ఇంకా మిగిలిపోయిన ఆ శాఖలోనివారందరూ ప్రధమ శాఖ గానూ పిలువబడుతున్నారని వినికిడి.
4) వీరేగాక బ్రాహ్మణులలో ఇంకా ఆంధ్రులు, తెలగాణ్యులు మొదలగు ఉప శాఖలు చాల వున్నాయి.