వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 2
వికీపీడియా నుండి
- 1869 - గుజరాత్ లోని పోర్బందర్ లో జన్మించిన మొహన్దాస్ కరంచంద్ గాంధీ, అహింసా బోధకుడై, సత్యాగ్రహ విధాన రూపకర్తయై, భారతదేశ స్వాతంత్ర్య పోరాట సారథియై, జాతిపితయై, మహాత్ముడయ్యాడు.
- 1904 - లాల్ బహదూర్ శాస్త్రి జన్మించాడు. భారతదేశపు రెండవ ప్రధానమంత్రి ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది.