వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 15
వికీపీడియా నుండి
- 1542: మొఘల్ చక్రవర్తి అక్బర్ సింధు ప్రాంతంలోని అమర్కోట్లో జన్మించాడు.
- 1582: పోప్ గ్రెగరీ-13 గ్రెగరియన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అప్పటిదాకా అందరూ అనుసరిస్తున్న జూలియన్ క్యాలెండర్ ప్రకారం అంతకు ముందురోజు అక్టోబరు 4. కొత్త గణన ప్రకారం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తర్వాత రోజును అక్టోబరు 15గా చర్చి ప్రకటించింది. ఆ రకంగా మధ్యలో పదిరోజులను కావాలనే తప్పించడం విశేషం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న క్యాలెండర్ ఇదే.
- 1918: షిర్డీ సాయిబాబా పరమపదించిన రోజు. ఆ ఏడాది ఆరోజు విజయదశమి.
- 1920: 'గాడ్ఫాదర్' నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత మారియోపుజో పుట్టినరోజు.
- 1931: తమిళనాడు లోని రామేశ్వరం లో ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ జననం (పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం).
- 1932: దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ('టాటా సన్స్ లిమిటెడ్') ప్రారంభమైంది.
- 1949: బనారస్ సంస్థానం, త్రిపుర, మణిపూర్ భారత్లో విలీనమయ్యాయి.
- 1992: ఎయిర్ ఇండియా విమానం - కనిష్క పేల్చివేతకు సూత్రధారి తల్వీందర్ సింగ్ పర్మార్ ను భద్రతా దళాలు పంజాబులో కాల్చి చంపాయి.
- 1997: ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతి రాయ్ కు బ్రిటన్ అత్యున్నత సాహితీ పురస్కారం 'బుకర్స్ ప్రైజ్' లభించింది.